Pooja Hegde | తిరుమల శ్రీవారి సేవ‌లో పూజా హెగ్డే

Pooja Hegde
54 / 100
  • తిరుమల శ్రీవారి సేవ‌లో పూజా హెగ్డే

 

తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న పూజాకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.

తరువాత ఆమె రంగనాయకుల మండపానికి వెళ్లగా, అక్కడ వేదపండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు.

Read : Ram Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్

 

Related posts

Leave a Comment