Trisha : వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం

trisha
  • వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం

దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష, తన వ్యక్తిగత జీవనంతో మరోసారి వార్తల్లోకెక్కారు. నలభై ఏళ్లు దాటి కూడా ఇప్పటికీ అవివాహితగా ఉండటంతో ఆమె పెళ్లిపై తరచూ పుకార్లు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. గతంలో సహ నటుడు విజయ్‌తో ఆమెకు ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో తమిళ నటుడు శింబుతో త్రిష వివాహం చేసుకోనుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

ఇటీవల శింబు, త్రిష కలిసి ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా నవ్వుతూ కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఆ ఫోటో ఎప్పటి నది? ఏ సందర్భంలో తీసుకున్నది? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

త్రిష, శింబు మధ్య మంచి స్నేహం ఉందని కోలీవుడ్ వర్గాల్లో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ‘అలై’, ‘విన్నైతాండి వరువాయా’ వంటి హిట్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జోడీ, లాక్‌డౌన్ సమయంలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘కార్తీక్ డయల్ సైత ఎన’లో మరోసారి కలిసి మెప్పించారు. అప్పటి నుంచి వారి మధ్య బంధం మరింత బలపడిందని భావిస్తున్నారు.

ఇంతకుముందు త్రిష పెళ్లిపై వచ్చిన వార్తలు అన్నీ వదంతులుగానే మిగిలిపోయిన నేపథ్యంలో, ఈ తాజా ప్రచారం ఎంతవరకు నిజమో తెలియాలంటే త్రిష లేదా శింబు అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. అప్పటివరకు ఇది కేవలం గాసిప్‌గానే చూడటం ఉత్తమం.

Read : Heroine Trisha : అలాంటి పాత్రకు త్రిష ఓకే చెప్పడం ఆమె చేసిన పొరపాటు

Related posts

Leave a Comment