రామ్ చరణ్ ‘పెద్ది’ టీం నుంచి క్రేజీ అప్డేట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఊర మాస్ లుక్లో చరణ్ కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడివే జోష్కి కొనసాగింపుగా ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ను ‘ఫస్ట్ షాట్’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఈ గ్లింప్స్కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ గ్లింప్స్ మిక్సింగ్ను మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వయంగా పూర్తి చేసినట్లు మేకర్స్…
Read MoreCategory: Movie Updates
Daily Movie Updates
Pooja Hegde | తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే
తిరుమల శ్రీవారి సేవలో పూజా హెగ్డే తిరుమల శ్రీవారిని టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న పూజాకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత ఆమె రంగనాయకుల మండపానికి వెళ్లగా, అక్కడ వేదపండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను ఆమెకు అందజేశారు. Read : Ram Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్
Read MoreRam Charan : దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్
దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించిన రామ్ చరణ్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 40వ ఏట అడుగుపెట్టారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతూ, దర్శకుడు బుచ్చిబాబుకు విలువైన బహుమతులు పంపించారు. గిఫ్ట్లతో పాటు చరణ్ చేతిరాత లేఖను కూడా జోడించారు. ఆ లేఖలో చరణ్ ఇలా పేర్కొన్నారు: “బుచ్చి… హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠినమైన సమయాల్లో కూడా హనుమంతుడిపై నాకున్న నమ్మకమే నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నేను నా జీవితంలో 40వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ ఘట్టంలో ఆ శక్తిని కొంత నీతో పంచుకోవాలని కోరుకున్నాను. నా జీవితంలో నీకు ప్రత్యేక స్థానం ఉంది. నీవు ఎల్లప్పుడూ సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దీవెనలు నీపై ఎల్లప్పుడూ ఉండాలి. ఈ బహుమతి…
Read MoreSiddhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్
సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’ టీజర్ రిలీజ్ సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. సిద్ధూ మార్కు కామెడీ టైమింగ్ ని వాడుకుంటూనే యాక్షన్, ఫన్ రెండింటిని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ బ్యాలన్స్ చేసిన తీరు ఆసక్తి గొలిపేలా ఉంది. తన మిషన్ పేరు బటర్ఫ్లై అంటూ సిద్ధూ సందడి చేశారు. ట్రైలర్ చివర్లో రొమాన్స్ గురించి సిద్ధూ చెప్పే డైలాగులు, నాన్నగా నటించిన నరేశ్…
Read MoreAishwarya Rai : ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ జీతం చూసి నెటిజన్లు షాక్!
ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ జీతం చూసి నెటిజన్లు షాక్! సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత కోసం వ్యక్తిగత బాడీగార్డులను నియమించుకోవడం సాధారణమే. కానీ, మాజీ ప్రపంచ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాడీగార్డు శివరాజ్ తీసుకుంటున్న వేతనం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రెగ్యులర్ జీతమా? సీఈఓ స్థాయి పేమెంటా? శివరాజ్ అందుకుంటున్న వేతనాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని జీతం అనేక బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే ఎక్కువ అంటూ చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుందంటే… శివరాజ్ నెల జీతం: అక్షరాలా రూ.7 లక్షలు! ఏడాదికి: రూ.84 లక్షలు ఐశ్వర్య రాయ్ నుంచి వేతనంగా అందుకుంటున్నాడట! బచ్చన్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి! ఐశ్వర్య దేశం, విదేశం ఎక్కడికెళ్లినా శివరాజ్ వెన్నంటే ఉంటాడు. కేవలం బాడీగార్డు గానే కాదు,…
Read MoreNiharika Konidela : తన రెండో సినిమాని ప్రకటించిన నీహారిక
నిర్మాతగా నిహారిక కొణిదెల రెండో సినిమా ప్రకటించింది! మెగా డాటర్ నిహారిక కొణిదెల గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ నుంచి కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం రూ. 50 కోట్ల భారీ వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడేమో, నిహారిక నిర్మాతగా తన రెండో చిత్రాన్ని ప్రకటించింది! ఈ కొత్త చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా, సంగీత్ సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇదే. నిహారిక – సంగీత్ – మానస శర్మ కాంబో ఇదే ఫస్ట్ కాదు!…
Read MoreGV Prakash Kumar: పెట్టింది 20 కోట్లు… కానీ వచ్చింది 5 కోట్లు మాత్రమే
తమిళంలో హీరోగా మంచి క్రేజ్ అందుకున్న జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తన ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాదు, మరో వైపు సంగీత దర్శకుడిగాను బిజీగా ఉన్నాడు. అంతేకాదు, అప్పుడప్పుడు నిర్మాతగా కూడా తన పేరును చర్చించుకునేలా చేస్తున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమా ‘కింగ్ స్టన్’, అడ్వెంచర్తో కూడిన ఫాంటసీ హారర్ మూవీ. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సహనిర్మాతగా వ్యవహరించాడు. మార్చి 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా, కేవలం 5.35 కోట్ల రూపాయల మాత్రమే వసూలు చేయగలిగింది. దాంతో, భారీగా నష్టాలను మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా ఏప్రిల్ 4 నుంచి నాలుగు భాషల్లో ‘జీ 5’లో…
Read MoreKannappa : అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే
అందులో ఎలాంటి నిజం లేదు అవన్నీ పుకార్లే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాను చుట్టూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిరాధారమైనవని, అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్ షో నిర్వహించారని వస్తున్న వార్తలు అసత్యమని, అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని చిత్ర బృందం కోరింది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకు సంబంధించిన కొంత ఫుటేజ్ను మాత్రమే సమీక్షించామని, సినిమా ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలియజేశారు. కావాలనే సినిమాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘కన్నప్ప’లో భారీ స్థాయిలో VFX పనులు ఉన్న కారణంగా ప్రతీ ఫ్రేమ్ను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నామని, అందువల్ల ఎక్కువ సమయం…
Read MorePayal Rajputh : ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది : పాయల్
ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం కష్టంగా మారుతోంది : పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పాయల్ రాజ్ పుత్, అనంతరం పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. “నటుడిగా కెరీర్ ప్రారంభించడం చాలా కష్టం. ప్రతిరోజూ ఏదో ఒక అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. బంధుప్రీతి, వివక్ష రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నా నిరూపించుకోవడం చాలా క్లిష్టం” అని పాయల్ తన భావాలను వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ప్రముఖ కుటుంబాల వారికే అవకాశాలు దక్కుతున్నాయనీ, ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించింది. “ఆధిపత్య ధోరణులు విస్తరించిన ఈ (సినీ) ప్రపంచంలో నా శ్రమ, అంకితభావం నిజంగా ఫలితాన్నిస్తాయా అనే సందేహం కలుగుతుంది. పేరుప్రఖ్యాతులు…
Read MoreNandamuri Balakrishna: పద్మభూషణ్ సరైన సమయంలో వచ్చిందనుకుంటున్నా: బాలకృష్ణ
పద్మభూషణ్ సరైన సమయంలో వచ్చిందనుకుంటున్నా: బాలకృష్ణ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుపై బాలకృష్ణ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 4న ఆదిత్య 369 పునః విడుదల సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ ప్రసంగించారు. సినీ రంగంలో నటుడిగా, రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, ఓటీటీ వేదికపై హోస్ట్గా, అలాగే క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా సేవలు అందిస్తున్న విషయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పద్మభూషణ్ అవార్డు ఆలస్యంగా వచ్చిందని కొందరు అంటున్నా, తన దృష్టిలో ఇది సరైన సమయంలో అందిందని పేర్కొన్నారు. “అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేయడం నా లక్ష్యం” అని బాలకృష్ణ తెలిపారు. ఆదిత్య 369 తరహా చిత్రాన్ని రూపొందించాలని చాలామంది…
Read More