ఫిల్మ్ ఫెస్టివల్లో కుశేందర్ రమేశ్ రెడ్డికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు రజాకార్’ చిత్రంలో తన అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన కుశేందర్ రమేశ్ రెడ్డికి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్కు విశేషమైన ఆదరణ లభించగా, తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ఆయనకు పురస్కారం లభించింది. కుశేందర్ రమేశ్ రెడ్డి కెరీర్ను పరిశీలిస్తే, ఆయన కెమెరామెన్షిప్ను పటిష్ఠంగా తయారు చేసుకున్న విధానం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఈగ’, ‘బాహుబలి 1 & 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ వద్ద చీఫ్ అసోసియేట్గా పని చేసిన ఆయన, అనుభవాన్ని ఆయుధంగా మలచుకుని ఇప్పుడు తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రజాకార్’ సినిమా ద్వారా దర్శకుడు యాటా సత్యనారాయణ చరిత్రలో దాగి ఉన్న నిజాలను, మరచిపోయిన…
Read More